80ఏళ్ల వృద్ధురాలిపై దాడి- ఇల్లు ధ్వంసం.. అడ్డొచ్చిన కుక్కపైనా..

By

Published : Dec 29, 2021, 1:02 PM IST

thumbnail

Old woman attacked Madurai: తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. వయసుకు సైతం గౌరవం ఇవ్వకుండా ఓ వృద్ధురాలిపై కర్కశంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. మధురైలోని కొట్టంపట్టిలో నివాసం ఉంటున్న లక్ష్మి(80)కి.. పొరుగింటి రాజంగంతో భూతగాదాలు ఉన్నాయి. దీనిపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం ఈ వివాదం హద్దుమీరగా.. రాజంగం మరో నలుగురు వ్యక్తులతో కలిసి లక్ష్మి, ఆమె కుమార్తెపై కర్రలతో దాడి చేశాడు. లక్ష్మి పెంపుడు శునకం దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దానిపైనా దుండగులు దాడి చేశారు. వృద్ధురాలి ఇంటినీ ధ్వంసం చేశారు. స్థానికులు ఈ వీడియో తీయగా.. దీని ఆధారంగా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీనిపై కొట్టాంపట్టి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.