100 కిలోల బంగారం, వెండి నగలు చోరీ.. షట్టర్​ ధ్వంసం చేసి మరీ..

By

Published : Feb 12, 2023, 6:08 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

రాజస్థాన్​ బారా జిల్లాలో దోపీడీ దొంగలు బీభత్సం​ సృష్టించారు. శనివారం అర్ధరాత్రి ఓ బంగారు దుకాణంలోకి చొరబడి సుమారు 100 కిలోల పసిడి, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.కోటి ఉంటుందని యజమాని తెలిపారు. ఛీపాబడౌద్​ ప్రధాన మార్కెట్​ సమీపంలోని ఓ నగల దుకాణం షట్టర్​ ధ్వంసం చేశారు దోపిడీ దొంగలు. ఆ శబ్దాలు విన్న యజమాని దుకాణానికి వెళ్లేసరికి దొంగలు అతడిపైనా దాడి చేశారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి లైసెన్స్​డ్ తుపాకీ తీసుకువచ్చి దొంగలపైకి కాల్పులు జరిపాడు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. సుమారు 8 మంది దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడని ఎస్పీ కల్యాణ్​ తెలిపారు. చోరీ అనంతరం దొంగలు వ్యాన్​లో పారిపోయారని చెప్పారు.  

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.