గర్భిణీని మంచంపై మోసుకెళ్లి ఆసుపత్రి తరలించిన సీఆర్​ఫీఎఫ్​ జవాన్లు

By

Published : Dec 18, 2022, 5:49 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్​ఫీఎఫ్​ జవాన్లు గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని ఆసుపత్రి తరలించారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని గ్రామంలో ప్రసవవేదన పడుతున్న మహిళను మంచంపై పడుకోబెట్టి వాహనం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం సుక్మా జిల్లాలో ఆ సంఘటన జరిగింది. నక్సల్​ ప్రభావిత గ్రామమైన పోట్కపల్లిలో వెట్టి మాయ అనే మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతుంది. విషయం, అదే గ్రామ పరిసరాల్లో క్యాంపు ఏర్పాటు చేసుకుని ఉన్న సీఆర్​పిఎఫ్​ జవాన్లకు తెలిసింది. వెంటనే కొందరు జవాన్లు, తమ మెడికల్​ టీంతో మహిళ ఇంటికి చేరుకున్నారు. మొదటి ఆ మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఓ సివిల్​ వాహనంలో ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జవాన్ల సాయానికి కృతజ్ఞతలు తెలిపారు వెట్టి మాయ కుటుంబ సభ్యులు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.