యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మ వారికి కన్నుల పండువగా ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్ఠింపజేశారు. బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను... స్వామి వారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు.
అమ్మ వారిని వివిధ రకాల పూలు, తులసీ దళాలతో, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలి: బండి