ETV Bharat / state

వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్​ సేవ

author img

By

Published : Jan 23, 2021, 6:43 AM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజల్​ సేవ నిర్వహించారు. ఆండాళ్​ అమ్మ వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య హారతులిచ్చారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Yadadri conducted Unjal service at Sri Lakshminarasimhaswamy Temple
యాదాద్రి క్షేత్రంలో ఊంజల్​ సేవ

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మ వారికి కన్నుల పండువగా ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్ఠింపజేశారు. బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను... స్వామి వారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు.

అమ్మ వారిని వివిధ రకాల పూలు, తులసీ దళాలతో, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Yadadri conducted Unjal service at Sri Lakshminarasimhaswamy Temple
యాదాద్రి క్షేత్రంలో ఊంజల్​ సేవ



ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​ తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలి: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.