ETV Bharat / state

యాదాద్రిలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు

author img

By

Published : Jan 24, 2021, 3:37 PM IST

Breaking News

తెలంగాణ ఫిల్మ్​ ఛాంబర్​ ఆఫ్ కామర్స్ సభ్యులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ ఛాంబర్​లో నమోదు చేసుకున్న వారికి హెల్త్​ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శనివారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దర్శించుకున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను వెలికితీయడానికి ఈ ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేశామని ఛాంబర్​ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్​ తెలిపారు. దీనిలో సభ్యత్వం తీసుకున్న వారికి... హెల్త్ కార్డులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫిల్మ్​ ఛాంబర్​ ద్వారా 900మంది ప్రొడ్యూసర్లు, 6వేల మంది టెక్నీషియన్లు, 1000 మంది మ్యూజిషియన్లు ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ బూర్గుల మధుసూధన్, ఫిల్మ్​ ఛాంబర్​ వైస్ ఛైర్మన్ గురురాజ్, వైస్ ప్రెసిడెంట్ పూజిత, నటీనటులు మహేశ్వరీ, ప్రియలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన.. పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.