యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్క్రాస్, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'పర్యావరణం-మట్టి విగ్రహాలు' అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితాన్ని కాంక్షించి, మట్టి విగ్రహాలను పూజించాలని విద్యార్థులకు సూచించారు. విగ్రహాన్ని మన ఇంటి పెరట్లోనే నిమజ్జనం చేసి, ఆ ప్రదేశంలో ఒక మొక్కను నాటాలని ఇండియన్ రెడ్క్రాస్ ఛైర్మెన్ డా.లక్ష్మీ నర్సింహరెడ్డి విద్యార్థులను కోరారు.
ఇదీ చూడండి:'శారదా' కేసులో తృణమూల్ నేతలకు సమన్లు