ETV Bharat / state

కొండకింద నారసింహుని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి!

author img

By

Published : Mar 22, 2021, 7:28 PM IST

యాదాద్రీశుని కల్యాణోత్సవానికి కొండ కింద జడ్పీ పాఠశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలాలయంలో ఉదయం స్వామివారి తిరు కల్యాణం జరగగా.. భక్తుల కోసం కొండకింద మరోసారి జరగనుంది. విద్యుద్దీపాలంకరణలతో పాఠశాల మైదానం అందంగా ముస్తాబైంది.

arrangements-for-yadadri-lakshmi-narasimha-swami-kalyanam-in-yadadri-bhuvanagiri-district
కొండకింద నారసింహుని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి!

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం బాలాలయంలో శాస్త్రోక్తంగా తిరు కల్యాణ వేడుకలు జరగ్గా... రాత్రికి కొండ కింద మరోసారి ఉత్సవం జరగనుంది. పాత జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించనున్నారు.

సోమవారం రాత్రి 8 గంటలకు వైభవోత్సవ కల్యాణం ప్రారంభం కానుండగా... వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఎల్ఈడీ టీవీలు అందుబాటులో ఉంచారు. విద్యుద్దీపాలంకరణలతో పాఠశాల మైదానం శోభాయమానంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.