ETV Bharat / state

ఐనవోలులో ప్రజాప్రతినిధుల మొక్కులు.. భారీసంఖ్యలో భక్తులు

author img

By

Published : Jan 14, 2021, 7:57 PM IST

mlas, mlc participated in the Inavolu Mallikarjuna Swamy Jatara in warangal urban dist
ఐనవోలు మల్లిఖార్జునస్వామి జాతరలో ప్రజాప్రతినిధులు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు శ్రీ మల్లిఖార్జునస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఆలయాలు కళను సంతరించుకున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు శ్రీ మల్లిఖార్జునస్వామిని ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు.

అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇదీ చూడండి : భక్తిపారవశ్యం... రామేశ్వరాలయంలో భక్తుల కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.