ETV Bharat / state

జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

author img

By

Published : Oct 2, 2020, 12:33 PM IST

mahatma gandhi jayanthi celebrations at warangalby mla vinay bhaskar
జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ విప్​ వినయ్​భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని పబ్లిక్​ గార్డెన్​ వద్ద మహాత్ముని విగ్రహానికి ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే వినయ్​భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్​ రాజీవ్​గాంధీ, మేయర్​ గుండా ప్రకాశ్​రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాతిపిత గాంధీజీ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ప్రభుత్వ విప్ వినయ్​భాస్కర్​ తెలిపారు. మహాత్మ చూపిన అహింస, సత్యాగ్రహం దీక్ష ప్రేరణతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండిః మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.