ETV Bharat / state

మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

author img

By

Published : Oct 2, 2020, 11:30 AM IST

మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​
మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా లంగర్​హౌస్​లోని బాపూ ఘాట్​ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​, ఇతర మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​, ఇతర మంత్రులు.. జాతి పితకు నివాళులు అర్పించారు. లంగర్​హౌస్​లోని బాపూ ఘాట్​ వద్ద జాతిపిత విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

కార్యక్రమంలో మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి, మంత్రులు సత్యవతి రాఠోడ్​, ఇంద్రకరణ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.