ETV Bharat / state

కేయూలో చితకబాదుకున్న విద్యార్థులు

author img

By

Published : Oct 30, 2020, 12:01 PM IST

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నాన్ బోర్డర్స్ వీరంగం సృష్టించారు. విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ విభాగంలో విద్యార్థులు, నాన్ బోర్డర్స్ మధ్య ఘర్షణ చెలరేగి కొట్టుకున్నారు.

కేయూలో చితకబాదుకున్న విద్యార్థులు
కేయూలో చితకబాదుకున్న విద్యార్థులు

వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు... నాన్​బోర్డర్స్ మధ్య ఘర్షణ చెలరేగింది. వర్సిటీలోని స్పోర్ట్స్‌ విభాగంలో ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. క్రీడా విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూ పంపిణీ విషయంలో వివాదం చెలరేగింది.

ఫిర్యాదు
ఫిర్యాదు

దుస్తుల పంపిణీ విషయంలో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ అవకతవకలకు పాల్పడుతున్నారని విద్యార్థులు నిలదీశారు. పక్కనే ఉన్న నాన్‌ బోర్డర్స్‌ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత విద్యార్థులు కాకతీయ వర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుస్తుల విషయంలో ప్రశ్నించినందుకే డైరెక్టర్‌ నాన్‌ బోర్డర్స్‌ను పిలిపించి కొట్టించారని బాధితులు ఆరోపించారు.

చితకబాదుకున్న విద్యార్థులు
చితకబాదుకున్న విద్యార్థులు

ఇవీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.