ETV Bharat / state

నేడు తొర్రూరు, హాలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్​ సభలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 7:50 AM IST

CM KCR Election Campaign Today : మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్​ రెండో రోజు పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో జరిగే బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అక్కడి బీఆర్​ఎస్​ శ్రేణులు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సభ అనంతరం నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లో పాల్గొననున్నారు.

CM KCR Election Campaign
CM KCR Election Campaign Today

CM KCR Election Campaign Today : ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లు పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గపు పరిధిలోని మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం మహబూబాబాద్​ రోడ్​లోని సభాస్థలిలో బీఆర్​ఎస్​ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. కేసీఆర్​ పర్యటన(CM KCR Election Campaign)ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సభకు దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరవుతారని బీఆర్​ఎస్(BRS)​ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో జనగామ, మహబూబాబాద్​, వర్ధన్నపేట, నర్శంపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న సభ ఈ జిల్లాలో ఐదోది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం.. ముఖ్యమంత్రి హెలికాప్టర్​లో నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొననున్నారు. అలాగే దీపావళి తర్వాత సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్​ జిల్లాల్లోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్​ పర్యటించారు. కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారాలు

BRS Public Meeting Today : కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటించిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్​ తన ప్రచారంతో బీఆర్​ఎస్​ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్​ఎస్​ ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ సీఎం కావాలని ఉవ్వెళ్లూరుతున్నారు. అందులో భాగంగా గత నెల 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ దళాధిపతి.. బీఆర్​ఎస్​ మేనిఫెస్టోను విడుదల చేస్తూ మొదటి విడతగా హుస్నాబాద్‌లో సభ మొదటి సభను నిర్వహించారు.

CM KCR BRS Public Meetings Schedule : అదే నెల 18వరకు సభలు నిర్వహించారు. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా సభలను వాయిదా వేశారు. గత నెల 26 నుంచి ఈనెల మూడో తేదీ వరకు రెండో విడత సభలను నిర్వహించారు. నవంబరు 9న గజ్వేల్​, కామారెడ్డిలో నామినేషన్లు వేసి.. కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభతో ముగింపు పలికారు. తర్వాత దీపావళి వరకు విరామం తీసుకుని మూడో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించి 16 రోజుల్లో 54 సభలు నిర్వహించడానికి ప్లాన్​ చేసుకున్నారు.

'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'

విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.