ETV Bharat / state

కరోనా వైరస్ దరిచేరకుండా ప్రజలకు అవగాహన

author img

By

Published : Oct 12, 2020, 8:07 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీయం కూడలిలో పోలీసులు కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు. మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

కరోనా వైరస్ దరిచేరకుండా ప్రజలకు అవగాహన
కరోనా వైరస్ దరిచేరకుండా ప్రజలకు అవగాహన

కరోనా వైరస్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీయం కూడలిలో మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞను చేయించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.