ETV Bharat / state

నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి: ఏసీపీ రమేశ్​

author img

By

Published : Aug 30, 2020, 10:19 PM IST

acp ramesh speak about ganesh immersion in warangal rural distirct
నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి: ఏసీపీ రమేశ్​

గణపతి నిమజ్జనంలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని వరంగల్ గ్రామీణ ఏసీపీ రమేశ్​ హెచ్చరించారు. వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనాన్ని నిర్వాహకులు నిబంధనలకు లోబడి జరుపుకోవాలన్నారు.

కరోనా నేపథ్యంలో గణపతి నిమజ్జనంలో నిబంధనలు పాటించాలని వరంగల్ గ్రామీణ ఏసీపీ రమేశ్ చెప్పారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనాన్ని నిర్వాహకులు నిబంధనలకు లోబడి జరుపుకోవాలన్నారు. నిమజ్జనం రోజు పట్టణం, గ్రామాల్లో పోలీసు పెట్రోలింగ్ ఉంటుందని, గుంపులుగా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.