ETV Bharat / state

'అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి'

author img

By

Published : Sep 21, 2020, 5:59 PM IST

'అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి'
'అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి'

అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా పరిధిలో మొత్తం 71 రైతు వేదికలు నిర్మాణంలో ఉన్నాయని.. అందులో 6 రైతు వేదికలు తుది దశ నిర్మాణానికి చేరుకున్నాయని తెలిపారు.

వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికలన్ని అక్టోబర్ 10 నాటికి పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా పరిధిలోని కంచిరావుపల్లి, కంబాలపురం, శ్రీరంగాపురం, వెంకటాపురం, తదితర గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పరిశీలించారు. పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వివరాలను సైతం కలెక్టర్ సందర్శించారు.

జిల్లా పరిధిలో మొత్తం 71 రైతు వేదికలు నిర్మాణంలో ఉన్నాయని.. అందులో 6 రైతు వేదికలు తుది దశ నిర్మాణానికి చేరుకున్నాయని కలెక్టర్‌ తెలిపారు. కొన్ని రైతు వేదికలు బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రత్యేక అధికారులకు సూచించారు.

వెంకటాపురంలో పూర్తయిన తడి, పొడి చెత్త సెగ్రిగేషన్ షెడ్డును కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిందని.. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అక్టోబర్ 10 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి : కలెక్టర్ యాస్మిన్ భాష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.