ETV Bharat / state

'సరిహద్దు వద్ద కార్మికులను పరీక్షించండి'

author img

By

Published : May 2, 2020, 1:46 PM IST

vikarabad-district-collector-pousami-basu-inspected-ravulapally-check-post
వికారాబాద్​ జిల్లా కలెక్టర్ పౌసమి బసు

లాక్​డౌన్ ​వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణవాసులు, రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని అధికారులను వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ పౌసమి బసు ఆదేశించారు. రావులపల్లిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టును తనిఖీ చేశారు.

వికారాబాద్​ జిల్లా కొడంగల్​ మండలం రావులపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్​పోస్టును కలెక్టర్​ పౌసమి బసు తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారిని చెక్​పోస్టు వద్ద పరీక్షించి కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్​కు తరలించారని అధికారులను ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు, రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి దశరథ్ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.