ETV Bharat / state

మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం..

author img

By

Published : Jun 1, 2020, 9:58 PM IST

Vikarabad Collector Pausumi Basu angry over municipal Officials
మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం..

వికారాబాద్​ జిల్లా పరిగి పట్టణంలో అడగడుగునా చెత్తాచెదారాలు, వ్యర్థాలతో నిండిపోయి వీధులు కనిపించటం వల్ల కలెక్టర్​ పౌసుమి బసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఇంటికి పంపించేస్తానని హెచ్చరించారు.

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య లోపాలపై అధికారులను నిలదీశారు. కాలనీలో డ్రైనేజీలను దగ్గరుండి తీయించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని కాలనీలను పారిశుద్ధ్యంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం పరిగి మండలం ఖదావన్​పూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.