ETV Bharat / state

'పార్టీలకతీతంగా ప్రభుత్వాలకు మద్దతు పలకాలి'

author img

By

Published : May 30, 2020, 7:05 PM IST

పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు మద్దతు పలకాల్సిన సమయం వచ్చిందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా నివారణ కోసం ఫాగింగ్ మిషన్​లను ప్రారంభించారు.

konda vishweshwar reddy started fogging machines
ఫాగింగ్ మిషిన్లను ప్రారంభించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరాస్తాలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫాగింగ్ మిషన్​లను ప్రారంభించారు. జేకేఎంఆర్​, ప్రోగ్రెసింగ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు హైపో క్లోరైడ్ రసాయన ద్రావణ యాంత్రాలతో పట్టణంలో పిచికారీ చేయించారు. ఒక యంత్రం వికారాబాద్​లోనే ఉంటుందని మిగితా ఐదు మిషన్​లు వేరే ప్రాంతాలకు పంపించనున్నట్లు తెలిపారు.

కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డుల్లో పిచికారీ చేయించుకోవాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.