ETV Bharat / state

"కేసీఆర్ మాటిచ్చి తప్పారు... గుణపాఠం తప్పదు"

author img

By

Published : Nov 8, 2019, 6:52 PM IST

కేసీఆర్​ మాట ఇచ్చి తప్పావ్​: మాజీ మంత్రి ప్రసాద్​

తహాసీల్దార్​ విజయారెడ్డి హత్యకు నిరసనగా కాంగ్రెస్​ ఆందోళనకు దిగింది. వికారాబాద్​ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

కేసీఆర్​ మాట ఇచ్చి తప్పావ్​: మాజీ మంత్రి ప్రసాద్​
వికారాబాద్​ కలెక్టరేట్ ముందు కాంగ్రెస్​ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరిస్తూ ధర్నా నిర్వహించారు. జాయింట్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగులకు మద్దతు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ప్రసాద్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 30 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్​ మాట ఇచ్చి తప్పారన్నారు. ధరణి వెబ్​సైట్​తో పైస్థాయి అధికారులు లాభ పడుతున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై విచారణ వాయిదా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.