ETV Bharat / state

'తాండూర్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగించాలి'

author img

By

Published : Mar 19, 2021, 9:43 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్​ ఛైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​ చేశారు. ఇతరుల ఓటును తన ఓటుగా వేసినందుకు ఈసీ ఆమెపై చర్యలు తీసుకోవాలన్నారు.

aicc spokes person serious on thanduru muncipal chairman swapna
'తాండూర్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగించాలి'

వికారాబాద్​ జిల్లా తాండూరు మున్సిపల్‌ ఛైర్​పర్సన్‌ స్వప్న పట్టభద్రురాలు కాకపోయినా.. మండలి ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఎన్నికల కమిషన్​ ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. అధికార తెరాస అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాము ముందు నుంచీ చెబుతున్నా.. ఈసీ, అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఇతరుల ఓటును స్వప్న ఎలా వేశారని శ్రవణ్​ ప్రశ్నించారు. దొంగ ఓటు వేసిన ఛైర్‌పర్సన్​ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని ఆయన అన్నారు.

'తాండూర్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగించాలి'

ఇదీ చూడండి: తాండూరు మున్సిపల్​ ఛైర్​పర్సన్ ఎమ్మెల్సీ ఓటుపై గందరగోళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.