ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : 'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ 70 స్థానాలకు పైగా గెలుస్తుంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 4:51 PM IST

Telangana Assembly Elections Notification
Telangana Assembly Elections 2023 Date

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ అక్టోబర్​ 6న.. నవంబర్​ 30న ఎన్నికలు జరుగుతాయని ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 70 స్థానాలకి పైగా సీట్లను గెలుస్తుందని.. తానే సొంతంగా సర్వే నిర్వహించారని అన్నారు. ముదిరాజులకు బీఆర్​ఎస్​ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

Telangana Assembly Elections 2023 : నవంబర్​ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 పైగా స్థానాలను కాంగ్రెస్​ పార్టీ గెలుస్తుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ, పీసీసీ ఎన్నికల కమిటీల ఆమోదంతో తాను హుజూర్​నగర్ నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తుందని.. 70 స్థానాలు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీనే నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోదాడ, హుజుర్​నగర్ నియోజకవర్గంలో 50వేల మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.

Unemployment Benefit Scheme not Introduced in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల మీద మరింత ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఎన్నికల దృష్ట్యా తాను సొంతంగా సర్వే నిర్వహించారని తెలిపారు. కేసీఆర్​ ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి(Nirudyoga Bruthi) 2018లో ప్రకటించి నాలుగున్నర సంవత్సరాలుగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఆ బకాయిలను ఇచ్చి నిరుద్యోగులను ఓట్లు అడగాలని అన్నారు.

'గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలం'

Uttam Kumar Reddy Comments on KCR : దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమిని మోసం చేసిన ఘనత కేసీఆర్​ ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజులకు 119 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. మాదిగలికి మంత్రివర్గంలో స్థానం లేదని ముస్లింలకి 12% రిజర్వేషన్ కల్పించకుండా గొడవలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప.. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్​ఎస్​ పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారు. వైన్​ షాపుల దందాలు.. ఇలానే ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటూ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నారు. వీటన్నింటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారు. అక్టోబర్​ 6న రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది.. నవంబర్​ 30న ఎన్నికలు జరగనున్నాయి. నేను హుజూర్​నగర్ నుంచి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలకి పైగా గెలుస్తాం. నల్గొండలో ఉన్న 12 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుస్తుంది. కేసీఆర్​ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. నేను సొంతంగా సర్వే నిర్వహించాను. "- ఉత్తమ్​కుమార్​ రెడ్డి, హుజుర్​నగర్ ఎంపీ

'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ 70 స్థానాలకు పైగా గెలుస్తుంది'

ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: ఉత్తమ్​ కుమార్​రెడ్డి

Uttamkumar Reddy on Party Change : బీఆర్​ఎస్​లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి.. ఏం చెప్పారంటే..?

Congress: 'రాహుల్ క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తుంటే.. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.