సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడం వల్ల శీలంశెట్టి వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి వంకాయలపాటి జగదీష్కు తీవ్ర గాయాలు కావడం వల్ల కోదాడకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. వీరిద్దరు కలకోవలోని పెళ్లి కార్యక్రమానికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. మృతుడు వెంకటేష్ కోదాడ మండలం ద్వారాకుంటకు చెందిన వ్యక్తి కాగా.. మరో వ్యక్తి జగదీష్ కోదాడ మండలం చిమిర్యాలకు చెందినవాడు.
ఇవీ చూడండి: కల్వర్టును ఢీకొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం