పల్లె ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఐజీ నాగిరెడ్డి పర్యటించారు. పాలకీడు, గుడుగుంట్లపాలెంలో ఏర్పాటు చేసిన నర్సీరలను పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీధిలో చెత్త పడేసే వారికి జరిమానా విధించాలని సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసి స్వీకరించాలని నాగిరెడ్డి అన్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, మురుగు నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బంజరు భూముల్లో మొక్కలు పెంచి హరిహారాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.