సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండాకు చెందిన రాంసింగ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. స్నేహితులు, అధ్యాపకులు అండగా నిలిచారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇటీవలే ఆయన తండ్రి మరణించడంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకున్న ఆయన బీఈడీ క్లాస్మేట్స్, అధ్యాపకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అందరు కలిసి రూ.50,000 జమచేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఈడీ క్లాస్మేట్స్ మురళీధర్ రెడ్డి, సత్యకాంత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, జితేందర్లు ఉన్నారు. రాజకీయ నాయకులు, దాతలు స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: మైదానంలోనే కుప్పకూలిన ఫుట్బాల్ ఆటగాడు