ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: బ్యాంకుల ముందు పడిగాపులు

author img

By

Published : May 26, 2021, 1:50 PM IST

people waiting in front of banks, husnabad banks rush
బ్యాంకుల ముందు జనం రద్దీ, హుస్నాబాద్ బ్యాంకుల ఎదుట రద్దీ

లాక్​డౌన్ ప్రభావంతో బ్యాంక్ పని వేళలను కుదించారు. సిబ్బందిని తగ్గించారు. ఈ క్రమంలో ఖాతాదారులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి వచ్చి బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి నగదు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

లాక్​డౌన్ ప్రభావంతో బ్యాంకుల పని వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుదించడం వల్ల వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల ఎదుట ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. యాభై శాతం మంది ఉద్యోగులు పని చేస్తుండడం, బ్యాంక్​లో భౌతిక దూరం పాటించడం వల్ల ఎదురు చూడాల్సిన వస్తోందని వాపోయారు.

ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయే లేదో తెలుసుకోవడానికి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హుస్నాబాద్​లోని పలు బ్యాంకుల్లో నగదు లేదని... వచ్చేదాకా ఆగాలని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు. నిరాశతో వెనుదిరిగారు. కొందరు బ్యాంక్ బయట భౌతిక దూరం పాటించడం లేదు.

ఇదీ చదవండి: వ్యాక్సిన్​ వేసుకుంటే రెండేళ్లలో మరణిస్తామనేది.. నిజమా? అబద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.