ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Jan 19, 2020, 4:48 PM IST

సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

komravelli_mallanna_jathara started in siddipeta
ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకోవటానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మల్లన్నను దర్శించుకున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పట్నంవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు కళాకారులు పసుపు బియ్యంతో పట్నంవేసి... మల్లన్నకు మొక్కులు చెల్లిస్తున్నారు.

స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివసత్తుల నృత్యాలతో ఆలయం పరిసరాలు సందడిగా మారాయి. తోట బావి వద్ద సదరు పట్నం అగ్ని గుండాలను నిర్వహిస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

Intro:tg_srd_16_19_komravelli_mallanna_jathara_start_av_ts10054
భక్తుల కొంగు బంగారం కోరమీసాల కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.


Body:సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు కోరమీసాల కొమురెల్లి మల్లన్న అంటూ భక్తులు బారులు తీరారు ఆలయ పరిసరాల్లో విడిది చేస్తున్న భక్తులు బోనాలతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణం శివసత్తుల నృత్యాలతో సందడి నెలకొంది మొదటి ఆదివారం పట్నం వారం కావడం తో హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు గంటలకొద్దీ క్యూలైన్లలో ఉండి మల్లన్నను దర్శించుకున్నారు

# పసుపు బియ్యం పిండితో పట్నాలు వేస్తున్న భక్తులు

గొల్ల కురుమల ఆరాధ్యదైవంగా కొలుస్తున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఒగ్గు కళాకారులు పసుపు బియ్యం పిండి తో పట్నం వేసి మల్లన్నను కొలుస్తున్నారు ఇలా చేయడాన్ని స్వామివారి కళ్యాణం గా భావిస్తున్నారు జాతరకు వచ్చే భక్తులు పట్నం వేసి మట్టి కుండల్లో నైవేద్యం తయారు చేసి మల్లన్నకు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్నాం.
మరికొంత మంది భక్తులు బోనాలు చేసి బొగ్గు కళాకారులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో కొండపై ఉన్న ఎల్లమ్మ తల్లి కి బోనం సమర్పించుకున్నారు


Conclusion:భారీగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు సోమవారం ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద సదరు పట్నం అగ్ని గుండాలను నిర్వహిస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగనున్న ట్లు ఆలయ వర్గాలు తెలిపాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.