ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన సంగారెడ్డి కలెక్టర్

author img

By

Published : Dec 24, 2020, 7:20 PM IST

sangareddy collecter started double bedrooms
డబుల్​ బెడ్​రూంలను ప్రారంభించిన సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని డబుల్​ బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. మండలంలోని అర్హులైన 45 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​తో కలసి ప్రారంభించారు. మండలంలోని 45 డబుల్​ బెడ్​రూంలను లబ్ధిదారులకు అందజేశారు.

మండలంలో త్వరలో మరొక 5 ఇళ్లు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. డబుల్​ బెడ్​రూంలు అందుబాటులోకి రావడంతో.. తమ సొంతంటి కల నెరవేరందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.