ETV Bharat / state

'ఆడబిడ్డల పెళ్లిళ్లకు.. కేసీఆర్​ మేనమామలా ఆదుకుంటున్నారు'

author img

By

Published : Sep 19, 2020, 7:50 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్​రావు తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేశారు.జహీరాబాద్​, కోహీర్​ మండలాల్లో 23 మంది లబ్ధిదారుల చొప్పున 46 మందికి 50 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

mla manik rao kalyana laxmi cheques distribution in zaheerabad, sangareddy district
'ఆడబిడ్డల పెళ్లిళ్లకు.. కేసీఆర్​ మేనమామలా ఆదుకుంటున్నారు'

ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్​ మేనమామ కానుకలా... కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేశారు.

జహీరాబాద్​, కోహీర్​ మండలాల్లో 23 మంది లబ్ధిదారుల చొప్పున 46 మందికి 50 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా గత ఏప్రిల్​ మాసంలో విద్యుదాఘాతంలో పస్తాపూర్​లో గేదెలు మృతి చెందిన రైతు కుటుంబానికి విద్యుత్ శాఖ అందజేసిన మూడు లక్షల 20 వేల పరిహారం చెక్కును అందజేశారు.

ఇదీ చదవండి: భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.