ETV Bharat / state

పటాన్​చెరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే

author img

By

Published : Jun 19, 2020, 3:37 PM IST

Development works at sangareddy
Development works at sangareddy

ప్రజల భాగస్వామ్యంతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సీతారామపురం కాలనీలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సీతారామపురం కాలనీలో రూ. 3.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఆయన ప్రారంభించారు.

ప్రణాళికాబద్ధంగా కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి చెప్పారు. త్వరలో చేపట్టబోయే హరితహారంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బొమ్మను వివాహం చేసుకున్న యువకుడు.. కారణం ఇదే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.