ETV Bharat / state

Corona cases in schools: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 29 మందికి పాజిటివ్​

author img

By

Published : Dec 2, 2021, 5:08 PM IST

Updated : Dec 2, 2021, 6:25 PM IST

coronacorona
corona

17:05 December 02

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 29 మందికి పాజిటివ్​

Corona cases in schools: సంగారెడ్డి జిల్లాలో జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గురుకులంలో 29 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. మొత్తం 284 మంది విద్యార్థినులను కొవిడ్​ టెస్ట్​లు చేయగా.. 29 మందికి వైరస్​ సోకినట్లు తేలింది.

నాలుగు రోజుల క్రితం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆదివారం (నవంబర్​ 28) 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు సోమవారం (నవంబర్​ 29) మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు.

ఇదీచూడండి: Corona Cases in gurukul school: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 48మందికి పాజిటివ్

Last Updated :Dec 2, 2021, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.