ETV Bharat / state

Corona Cases in gurukul school: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 48మందికి పాజిటివ్

author img

By

Published : Nov 29, 2021, 11:35 AM IST

Updated : Nov 29, 2021, 5:33 PM IST

Corona Cases in gurukul school
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 43మందికి పాజిటివ్

11:30 November 29

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 48మందికి పాజిటివ్

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

Muthangi gurukul school Covid-19 Cases : సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆదివారంనాడు 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధరణ అయింది. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 48కి చేరింది. పాఠశాలలో విద్యార్థులందరికీ నిర్ధరణ పరీక్షలు పూర్తయినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.

ఒకరికి స్వల్ప లక్షణాలు ఉండగా..

పటాన్​చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ఒక విద్యార్థికి స్వల్ప లక్షణాలు ఉండటంతో అనుమానంతో పాఠశాలలో వైద్య పరీక్షలు చేపట్టారు. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 27మంది సిబ్బంది, 491మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం 27 మంది సిబ్బంది, 261మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయురాలికి, 42మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తేలింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి ఆధ్వర్యంలో మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఇవాళ పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఐదుగురికి పాజిటివ్​గా తేలింది. పాఠశాలలోని మొత్తం 48 మంది బాధితుల్లో ఒక టీచర్, 47 మంది విద్యార్థులు ఉన్నారు.

హాస్టల్​లోనే క్వారంటైన్..

పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్​కు పంపించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో.. హస్టల్​లోనే క్వారెంటైన్​లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు

corona cases in wyra gurukul school: ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన

సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. ఇక అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. అంతేకాకుండా పాఠశాలల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: ' 'ఒమిక్రాన్​' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'

Last Updated :Nov 29, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.