రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీసీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్స్లో పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల డీలర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గంలోని డీలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు, ఇతర అధికారులు తరుచూ తనిఖీలు చేస్తామని డీసీపీ తెలిపారు. గతేడాది షాద్నగర్ ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసులో పట్టుబడిన వారి వాహనాలతోపాటు పాస్పోర్టు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో షాద్నగర్, చేవెళ్ల ఏసీపీలు కుషాల్కర్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Minister Harish Rao: వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్రావు