రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తలకొండపల్లి, ఆమనగల్, వెల్దండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్లు నాయకులు వివరించారు.