ETV Bharat / state

'తెలంగాణలోని అన్నిరంగాల అభివృద్ధికి కృషి'

author img

By

Published : Sep 8, 2020, 10:49 PM IST

నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

'అన్నిరంగాలను అభివృద్ధి పరిచేందుకు కృషి'
'అన్నిరంగాలను అభివృద్ధి పరిచేందుకు కృషి'

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తలకొండపల్లి, ఆమనగల్, వెల్దండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్లు నాయకులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.