ETV Bharat / state

ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్!

author img

By

Published : Mar 13, 2021, 6:14 PM IST

mlc-election-arrangements-at-serilingampally-and-chandanagar-in-hyderabad-city
ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధం... పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్!

రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్ చేశారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిల్స్​లో దాదాపు 24 వేల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాలను శానిటైజేషన్‌ చేశారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల కోసం శానిటైజర్​... దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి: ఆ స్కెచ్​పెన్​తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.