ETV Bharat / state

విషాదాంతం: తప్పిపోయిన బాలిక మృతదేహం లభ్యం

author img

By

Published : Aug 9, 2020, 9:37 AM IST

Missing girl's body found at himayath sagar
విషాదాంతం: తప్పిపోయిన బాలిక మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఈనెల 4న తప్పిపోయిన ఓ మైనర్​ బాలిక శవమై తేలింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధి హిమాయత్​సాగర్​లో బాలిక మృతదేహం లభ్యమైంది.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్​గూడకు చెందిన స్నేహలత అనే మైనర్​ బాలిక.. ఈనెల 4 నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు హిమాయత్​సాగర్​లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

శవాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గతంలో ఎయిర్​పోర్ట్ కాలనీకి చెందిన విజయ్​ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేయడం వల్ల.. మనస్తాపానికి గురైన స్నేహలత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విషాదాంతం: తప్పిపోయిన బాలిక మృతదేహం లభ్యం

ఇదీచూడండి: చాదర్​ఘాట్​లో రౌడీషీటర్ సజీద్​ దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.