ETV Bharat / state

గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు: కేటీఆర్

author img

By

Published : Oct 23, 2022, 5:14 PM IST

Updated : Oct 23, 2022, 5:40 PM IST

Ktr
Ktr

Ktr comments on BJP: కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో గౌడ కులవృత్తిని భాజపా నిషేధించిందంటూ విమర్శించారు. రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రైతు బీమా మాదిరిగా గీతకార్మికుల బీమా ఇచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Ktr comments on BJP: రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటకలో... కల్లు గీయడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రంగారెడ్ది జిల్లా మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌, గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ బంధు పెట్టాలంటున్న భాజపా.. తొలుత కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. రైతు బీమా మాదిరిగా గీతకార్మికుల బీమా ఇచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు: కేటీఆర్

'రాష్ట్రంలో 2014 ముందు విద్యుత్‌కు ఇబ్బంది ఉండేది. ఇవాళ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య పూర్తిగా పోయింది. నల్గొండ జిల్లాలో తీవ్ర నీటి ఇబ్బంది ఉండేది. రైతులు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రాంతంలోని కుల వృత్తులను ఆదుకుంటున్నాం. గీత కార్మికులకు త్వరలో మోపేడ్‌లు అందిస్తాం. కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి.' -కేటీఆర్‌, పురపాలకశాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వివేకానంద గౌడ్, మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ గుడిసెల రాజేశం గౌడ్, గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ గౌడ్, పల్లె రవి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 23, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.