రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని లోయపల్లిలో హరీశ్రావు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాలకూర్ల వెంకటేశ్ గౌడ్ (పీవీ గౌడ్) నేతృత్వంలో కేక్ కట్ చేశారు. మంచాల మండలంలోని నాలుగు గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒడిశాకు చెందిన వలస కూలీలకు పండ్లు పంచారు. కార్యక్రమంలో తెరాస విద్యార్థి విభాగం నాయకులు నాగరాజు ముదిరాజ్, కాటం గౌడ్, లింగ నాయక్, తాళ్లపల్లి నగేష్, నారి మల్లేశ్, పాలకూర్ల నగేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఒకరిపై ప్రేమ.. మరొకరిపై జాలి.. చివరికి ఆ యువకుడి కథ ఏమైందంటే?