ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో పర్యటించి ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమాస్ పల్లిలో 11 కేవీ విద్యుత్ నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇదే ప్రాంతానికి చెందిన కొంతమంది ఎన్నారైలు, అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నీటిశుద్ధి కేంద్రాన్ని, ఎమ్మార్సీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!