రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మునీర్ అనే వ్యక్తి కార్వాన్ నుంచి ఓ బాలికను తన నానమ్మ వద్దకు తీసుకెళ్తానంటూ టీఎస్13ఈఎం 3483 సంఖ్య గల స్కూటీ ఎక్కించుకున్నాడు. చిలుకూరు మీదుగా వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనం పైనున్న బాలిక ఒక్కసారిగా కేకలు వేసింది. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు గమనించి వారిని అడ్డగించి ప్రశ్నించారు. నిందితుని సమాధానాలతో అనుమానం వచ్చిన స్థానికులు దేహశుద్ధి చేసి మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్