రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం తడిసి మద్దయింది. తంగళ్ళపల్లి, వేములవాడ, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్ తదితర మండలాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం వర్షపు నీటితో పాటు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్లలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు సింగిల్విండో అధ్యక్షులు భాస్కర్ గౌడ్. రైతులెవరూ అధైర్యపడొద్దని, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా కల్పించారు. ముస్తాబాద్ మండలంలో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.
ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్వల్లా?