ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిముద్దయిన ధాన్యం

author img

By

Published : May 16, 2021, 4:06 PM IST

unseasonal rain in rajanna siricilla
అకాల వర్షానికి తడిసిముద్దయిన ధాన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదుర గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యమంతా తడిసిపోయింది. ప్రభుత్వమే తమకు దిక్కంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం తడిసి మద్దయింది. తంగళ్ళపల్లి, వేములవాడ, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్ తదితర మండలాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం వర్షపు నీటితో పాటు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్లలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు సింగిల్​విండో అధ్యక్షులు భాస్కర్ గౌడ్. రైతులెవరూ అధైర్యపడొద్దని, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా కల్పించారు. ముస్తాబాద్ మండలంలో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.

ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.