ETV Bharat / state

బైక్​పై తిరుగుతూ లాక్​డౌన్​ అమలును పరిశీలించిన ఎస్పీ

author img

By

Published : May 18, 2021, 5:33 PM IST

సిరిసిల్లలో ఏడో రోజు లాక్​డౌన్​ ప్రశాంతంగా అమలవుతోంది. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలకు జరిమానా విధిస్తున్నారు.

lockdown in siricilla district
బైక్పై తిరుగుతూ లాక్డౌన్ను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సిరిసిల్లలో నిబంధనల అమలు తీరును ఎస్పీ బైక్​పై తిరుగుతూ పర్యవేక్షించారు. 11 ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 71 వాహనాలపై ఇవాళ కేసులు నమోదు చేశామన్నారు.

అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టామని తెలిపారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.