ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు లేఖ

author img

By

Published : Jan 30, 2021, 4:28 PM IST

Manthani MLA sridher babu wrote a letter to CM kcr
సీఎంకు లేఖ రాసిన మంథని ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్​ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. 7.5 శాతం ఫిట్​మెంట్​పై పునరాలోచించి.. ఉద్యోగులు కోరుతున్న విధంగా ఫిట్​మెంట్​ను ప్రకటించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50 శాతం ఫిట్​మెంట్ ఇవ్వాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

Manthani MLA sridher babu wrote a letter to CM kcr
ఎమ్మెల్యే రాసిన లేఖ

పీఆర్సీ రిపోర్టుపై 31 నెలలుగా ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు. 7.5 శాతం ఫిట్​మెంట్ ప్రకటించడం ఉద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి పునరాలోచించి, వెంటనే ఉద్యోగులతో చర్చించాలన్నారు. వారు కోరుతున్న విధంగా 50 శాతం ఫిట్​మెంట్​ను త్వరలోనే ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఉద్యోగులు కోరుతున్న విధంగా హెచ్​ఆర్​ఏ స్లాబులను 20, 25, 30, 35గా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ఈహెచ్​ఎస్​ ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా అందించాలన్నారు. సీపీఎస్​ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ డీఏను యధావిధిగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల కనిష్ఠ వేతనం రూ.27 వేలు ఉండేలా, కనిష్ఠ పెన్షన్​ రూ.15 వేలుగా ఉండేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.

ఇదీ చూడండి: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.