ETV Bharat / state

'పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి'

author img

By

Published : Dec 23, 2020, 3:20 PM IST

ఎల్ఆర్ఎస్ రద్దు చేసి.. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్​ చేయాలని డిమాండ్ చేస్తూ భూ దస్త్రాల లేఖరులు, రియల్ వ్యాపారులు నిజామాబాద్​ కలెక్టరేట్ ధర్నా చౌక్​లో ఆందోళన చేపట్టారు. నూతన విధానం వల్ల ఇప్పటికే అనేక మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

writers and real estate business mans protest in front of nizamabad collectorate
'పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి'

నిజామాబాద్​ కలెక్టరేట్ ధర్నా చౌక్​లో భూ దస్త్రాల లేఖరులు, రియల్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసి.. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్​ చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టు ఇచ్చిన తీర్పును కాదని కొత్త పద్ధతిలోనే రిజిస్ట్రేషన్​ చేస్తున్నారని.. అది కూడా ఎల్ఆర్ఎస్ ఉంటేనే చేస్తున్నారని రియల్ వ్యాపారులు ఆరోపించారు. నూతన విధానం వల్ల ఇప్పటికే అనేక మంది రోడ్డున పడ్డారని.. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలన్నారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.