ETV Bharat / state

Martyr Soldier Mahesh: వీర జవాను మహేశ్​ కుటుంబానికి ప్రభుత్వం భరోసా

author img

By

Published : Nov 8, 2021, 5:34 PM IST

దేశ సరిహద్దుల్లో గతేడాది వీర మరణం పొందిన మహేశ్​(Martyr Soldier Mahesh) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. జవాను కుటుంబానికి ప్రభుత్వం నగదు, ఇంటి స్థలం, ఉద్యోగం కేటాయించింది. జవాను​ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి మహేశ్​ విగ్రహావిష్కరణ చేశారు.

Martyr Soldier Mahesh
వీర జవాను మహేశ్​

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన నిజామాబాద్​ వాసి జవాను ర్యాడ మహేశ్​​(Martyr Soldier Mahesh) కుటుంబానికి సర్కారు భరోసానిచ్చింది. ఆయన కుటుంబానికి రూ. 50లక్షలు, 300 గజాల ఇంటి స్థలం, మహేశ్​ భార్యకు రిజిస్ట్రేషన్​ శాఖలో జూనియర్​ అసిస్టెంట్​గా ఉద్యోగం కేటాయించింది.

మహేశ్​(Martyr Soldier Mahesh)​ గతేడాది నవంబరు 8వ తేదీన దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ అమరుడయ్యారు. నేడు ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా మహేశ్​​ స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లిలో జవాను విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా యువకులు వేల్పూర్‌ నుంచి కోమన్‌పల్లి వరకు ర్యాలీగా తరలివచ్చారు. అమర్‌ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం మహేశ్​(Martyr Soldier Mahesh)​ కుటుంబసభ్యులకు ప్రభుత్వం అందించిన సహాయానికి సంబంధించి పత్రాలను మంత్రి అందించారు.

సైనికుల త్యాగానికి వెల కట్టలేమని.. కానీ వారి కుటుంబానికి​(Martyr Soldier Mahesh) అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజంపై ఉందని మంత్రి అన్నారు. దక్షిణాది నుంచి ఆర్మీలోకి ఎక్కువగా చేరికలుండాలంటే అమర జవానుల కుటుంబాలకు భరోసా ఇవ్వటం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహేశ్​ కుటుంబ సభ్యులు, గ్రామస్థుల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR: నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టను: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.