నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు చూపించారు చిన్నారులు. అసెంబ్లీలో మాదిరిగా స్పీకర్, ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులుగా విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు. శాసన సభలో అధికార, విపక్షాలు చేసుకునే విమర్శలు, ఆరోపణలతో విద్యార్థులు ఆద్యంతం ఆకట్టుకున్నారు.
ఇవీ చూడండి: మాతృత్వానికే కళంకం... కన్నకూతురినే బస్సుకిందకు తోసేసింది!