ETV Bharat / state

డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి సంతృప్తి

author img

By

Published : Apr 4, 2021, 9:10 PM IST

Minister prashanth reddy,  double bedroom houses at balkonda
డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి సంతృప్తి

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. పనుల పురోగతి పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ బాల్కొండ నియోజకవర్గంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ, రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. వేల్పూర్‌, భీమ్‌గల్‌, బడా భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, పడగల్‌, బాల్కొండలలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో 1,656 ఇళ్లు నిర్మాణం చేపట్టగా.. అందులో 1,244 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయని చెప్పారు. ఐదు నెలల్లోగా పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. మరో 1,300 ఇళ్లు కొత్తగా మంజూరు కాగా.. వాటికి ప్థల సేకరణ కాగానే పనులు చేపడతామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.04 లక్షలు ఖర్చు చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో 2.86 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా 1.80 లక్షల ఇళ్లు తుది దశలో ఉన్నాయని, మరో 60 వేల ఇళ్ల నిర్మాణాలు గ్రౌండ్‌ లేవల్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది ఒక్కో ఇంటికి రూ.72 వేలు మాత్రమేనని చెప్పారు. త్వరలోనే సొంత ఇంటి స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకునే వారికి సైతం సాయం అందించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వెల్లడించారు.

కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.750 కోట్లు, మిషన్‌ భగీరథ కోసం రూ.28వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై భాజపా రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు.

ఇదీ చూడండి : పత్తి రైతులపై రూ.కోట్ల భారం..పెరగనున్న విత్తన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.