నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో మైనంపల్లి హనుమంతరావు సొంత నిధులతో ఆధునీకరించిన శివాలయం ఈరోజు ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు.
హైదరాబాద్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత, మైనం పల్లి హనుమంతరావు, ఇతర నేతలు వస్తున్నారు. నిజామాబాద్ నుంచి మూడు వేల ద్విచక్రవాహనాలతో ర్యాలీగా జన్నేపల్లికి రానున్నారు. కార్ల ర్యాలీ డ్రోన్ దృశ్యాలు ఆకర్షిస్తున్నాయి. మేడ్చల్ వద్ద కవిత స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
- ఇదీ చదవండి: హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలి: అజారుద్దీన్