ETV Bharat / state

శివాలయం ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన కవిత

author img

By

Published : Mar 1, 2021, 2:12 PM IST

శివాలయం ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన కవిత
శివాలయం ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన కవిత

నిజామాబాద్ జిల్లాలో శివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీతో బయలుదేరారు. నిజామాబాద్ నుంచి 3వేల వాహనాలతో ర్యాలీగా జన్నేపల్లికి రానున్నారు.

నిజామాబాద్​ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో మైనంపల్లి హనుమంతరావు సొంత నిధులతో ఆధునీకరించిన శివాలయం ఈరోజు ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు.

హైదరాబాద్​ నుంచి కార్లతో భారీ ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత, మైనం పల్లి హనుమంతరావు, ఇతర నేతలు వస్తున్నారు. నిజామాబాద్ నుంచి మూడు వేల ద్విచక్రవాహనాలతో ర్యాలీగా జన్నేపల్లికి రానున్నారు. కార్ల ర్యాలీ డ్రోన్​ దృశ్యాలు ఆకర్షిస్తున్నాయి. మేడ్చల్ వద్ద కవిత స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

శివాలయం ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన కవిత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.