పేదరికం అనేది డబ్బుతో రాదని.. గుణంతో వస్తుందని మన గుణం మంచిగుంటే మనకన్నా గొప్పవారు ఎవరూ ఉండరని జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్వంలో విద్యార్థులకు పిల్లల హక్కులు-ఉపయోగం అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయిరమాదేవి, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి