ETV Bharat / state

fire in forest: అడవిలో చెలరేగిన మంటలు..

author img

By

Published : Mar 17, 2022, 7:15 PM IST

fire in forest
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/17-March-2022/14760897_111.jpg

fire in forest: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపకశాఖకు సమాచారమిచ్చిన గ్రామస్థులు మంటలార్పేందుకు యత్నించారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

fire in forest: ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప గ్రామాలైన మరికల, లక్ష్మీపురం, రామకృష్ణాపురం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక, అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. మంటలు గ్రామాల వైపునకు రాకుండా ఆర్పేందుకు గ్రామస్థులు యత్నించారు.

మంటలకు తోడు ఈదురు గాలులు తోడవడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.