ETV Bharat / state

అనిశా వలకు చిక్కిన మరో అవినీతి అధికారి

author img

By

Published : Mar 7, 2020, 11:39 AM IST

Updated : Mar 7, 2020, 12:47 PM IST

ఓ పక్క ఇచ్చిన మాట కోసం భూములను పట్టా చేయించి రైతులకు దేవుళ్లవుతుంటే... మరోపక్క లంచాలు తీసుకుంటూ రెవెన్యూ శాఖకు మచ్చ తెస్తున్నారు కొందరు. రైతుల చెమటను పిండుకుంటున్నారు. ఇలానే నారాయణ పేట జిల్లాలో ఓ అవినీతి అధికారి అనిశాకు అడ్డంగా దొరికిపోయాడు.

ACB CAUGHT VRO WHEN TAKING BRIBE FROM FARMER
ACB CAUGHT VRO WHEN TAKING BRIBE FROM FARMER

అనిశా వలకు చిక్కిన మరో అవినీతి అధికారి

నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు... తాత పొలాన్ని తమ పేర్ల మీద చేయించుకునేందుకు వీఆర్ఓ పద్మనాభంను కలిశాడు. పట్టా చేసివ్వడానికి రూ. 9000 ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్​ చేశాడు.

లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న అనిశా... పథకం ప్రకారం డబ్బులు తీసుకునే సమయంలో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నేరాన్ని వీఆర్​ఓ పద్మనాభం ఒప్పుకోవడంతో నిందితున్ని అరెస్టు చేశారు.

Last Updated : Mar 7, 2020, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.